సిద్దేశ్వరుడి ఆలయంలో మహా "మహా ఘట్టం" ప్రారంభం..
మహా గిరి ప్రదక్షిణ ప్రారంభం
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
సాక్షాత్ పరమశివుడి రూపమైన స్వయంభుసిద్ధేశ్వరుడి కొండ చుట్టూ సాగే మహా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని బచ్చన్నపేట మండలం ,కొడవటూరు గ్రామంలో సిద్దేశ్వరుడి దేవస్థానం వద్ద ప్రముఖ పండితులు ఓం నమశ్శివాయ, ఈవో వంశీ భక్తులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినెల ఆరుద్ర నక్షత్ర అద్భుత ఘడియల్లో అత్యంత వైభవంగా మహా గిరి ప్రదక్షణ ప్రారంభమవుతోంది.ప్రతి అడుగూ పుణ్యప్రదం ప్రతి శ్వాస శివనామ స్మరణం! శివుడినే గిరిగా భావించిచేసేఈప్రదక్షిణవల్లజన్మజన్మలపాపాలుతొలగిపోతాయనికోరినకోర్కెలునెరవేరుతాయనిసాక్షాత్తుశివుడుమీవెంటఉండిదీవిస్తారనిఅన్నారు.గిరి ప్రదక్షిణను అత్యంత భక్తిశ్రద్ధలతో, పాదరక్షలులేకుండానడిచేప్రతిఅడుగులోనూఓంనమఃశివాయ'మంత్రాన్నిజపిస్తూ,మీదృష్టినిపూర్తిగాఆసిద్ధేశ్వరుడిపైనేఉంచిఓంనమశ్శివాయనామంతోమారుమోగాలనిఅన్నారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ నీలా కవిత మురళి, ఆలయ ఈవో చిదం వంశీ, ప్రధాన అర్చకులు ఓం నమశివాయ, నిమ్మ కర్ణాకర్ రెడ్డి, నీల శ్రీకాంత్, చిరంజీవి,సిబ్బంది లక్ష్మీకాంత్, భాను తదితరులు పాల్గొన్నారు.













