ఈనెల 25న చలో హైదరాబాద్కు పద్మశాలీలు తరలి రావాలి.... పద్మశాలి ఐక్యతనే సంఘం బలోపేతం... కార్మికులందరూ సమన్వయంతో పోరాడాలి.... తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం మీడియా కార్యదర్శి చింతకింది కృష్ణమూర్తి...
పద్మశాలీలు.. చేనేత కార్మికుల ఐక్యత.. హక్కుల సాధన కోసం.
సమస్యల సాధన కోసం ఈనెల 25న బుధవారం హైదరాబాదులో జరిగే మహా ధర్నాకు చేనేత కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం మీడియా కార్యదర్శి చింతకింది కృష్ణమూర్తి పిలుపునిచ్చారు.. ఆదివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ తరతరాల నుండి కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్న చేనేత కార్మికుల హక్కుల సాధన కోసం ప్రతి చేనేత కార్మికుడు ఐకమత్యంతో ఉద్యమించాలని కోరారు... ప్రభుత్వాలు మారిన కూడా నేతల బతుకులు మారడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత పరిశ్రమ చేనేత కార్మికుల సమస్యలు చేనేత భరోసా నేతన్నల భీమా సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణమాఫీ సహకార ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు...










