ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన బికేఆర్
కుత్బుల్లాపూర్ మార్చ్ 21 (ప్రజా గొంతుక
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని గాగిల్లాపూర్ దుండిగల్ బహదూర్ పల్లి బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీ సాయిబాబా నగర్ అపురూప కాలనీ షాపూర్ నగర్ ముస్లిం మైనార్టీ సోదరుల ఆహ్వానం మేరకు రంజాన్ వేడుకల్లో పాల్గొన్న బి.కే.ర్ ఫౌండేషన్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంగునూరి కిషోర్ రెడ్డి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... భక్తిశ్రద్ధలతో కఠినమైన ఉపవాస దీక్షలు ముగించుకొని ప్రేమ శాంతి పరస్పర సహకారం ఐక్యమత్యంతో పవిత్రమైన రంజాన్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం వెలుగులు నింపి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వారితోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ కావలి గణేష్ ఏఆర్ సాధు యాదవ్ గజేంద్ర నర్సింహారెడ్డి, బైబడి సంతోష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.











