రంజాన్ వేడుకలలో మాజీ ఎంపిటిసి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎండి మసూద్...
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం ,జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం, అలింపురం గ్రామంలో ముస్లిం మైనార్టీ సోదరులతో కలిసి రంజాన్ వేడుకల్లో మాజీ ఎంపిటిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎండి మసూద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూపవిత్రమైన సందర్భంలో, ఈద్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈద్ అనేది మనల్ని సమాజంను దగ్గర చేసుకునే కరుణ, ఉదారత, ఐక్యత వంటి విలువలను ఆలోచించే సమయం. ఈ పండుగ ప్రతి ఇంటిలో శాంతి, సౌభాగ్యం, సమృద్ధిని,ఐశ్వర్యంతీసుకురావాలని, అన్ని సమాజాల మధ్య సోదరభావాన్ని మరింత బలపరచాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆనందం, ఆరోగ్యం, నిరంతర అభివృద్ధి కలగాలనిఆశిస్తున్నట్లు తెలిపారు..అదేవిధంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ పెద్దలు, సోదరులు పాల్గొన్నారు.











