పోతుగంటి వీరాచారికి ఘనంగా సన్మానం
ప్రజా గొంతుక న్యూస్, (మార్చి 21)సూర్యాపేట:హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని శారద కల్చరల్ లైవ్ స్టూడియో లో 19 గురువారం 2026 రోజున మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ, సంగీత సాహిత్య సాంస్కృతిక సమన్వయ సంస్థ హైదరాబాద్ అధ్యక్షులు డాక్టర్ వి.డి. రాజగోపాల్ నిర్వహించిన శ్రీ పరాభవనామ ఉగాది కవి సమ్మేళనంలో సూర్యాపేట పట్టణానికి చెందిన కవి, రచయిత, సామాజిక కార్యకర్త, శ్రీ శ్రీ కళా వేదిక సూర్యాపేట జిల్లా అధ్యక్షులు డా.పోతుగంటి వీరాచారి పాల్గొన్నారు. తాను రచించిన మట్టిపరిమళం పుస్తకావిష్కరణ మరియు ఉగాదిపై నిర్వహించిన కవి సమ్మేళనంలో మారని జీవన శైలి అనే అంశంపై కవితా పఠనం చేసినారు వీరాచారిని పలువురు కవి మిత్రులు అభినందించారు.వి.డి.రాజగోపాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ పద్మశ్రీ కోలకలూరి ఇనాక్ పూర్వ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ తిరుపతి చేతుల మీదుగా మెమోటో శాలువాతో డా. పోతుగంటి వీరాచారిని గురువారం రాత్రి ఘనంగా సత్కరించారు. రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్, ప్రముఖ కవి ఎ.యల్.కృష్ణారెడ్డి , స్వర సామ్రాట్ శరత్ చంద్ర. సిద్ధారెడ్డి ప్రముఖ జర్నలిస్ట్ మహమ్మద్ రఫీ ,రవీంద్ర బాబు, అరవా ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి 60మంది కవులు, కవయిత్రులు తదితరులు పాల్గొన్నారు.











