ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ....
ప్రజా గొంతుక చేర్యాల: పట్టణంలోని పదో వార్డులో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన నేటి శెట్టి ఉమా శ్రీధర్ వాడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు తిలక్ నగర్ లో బత్తేపు ఇండ్ల వద్ద ఎన్నో ఏండ్లుగా నీటి సమస్య ఉందని విషయం గమనించిన కౌన్సిలర్ ఉమా శ్రీధర్ ప్రజలందరికీ ఉపయోగపడేలా తమ సొంత ఖర్చులతో బోర్ వేయించారు. అనంతరం మేడిశెట్టి ఉమా శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటు వేసినందుకు ఇచ్చిన మాటకు రుణపడి ఉంటామని తెలిపారు. అనంతరం వార్డు ప్రజలు వర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ముస్ట్యాల అరుణ బాల నరసయ్య, కౌన్సిలర్లు నిమ్మ సుప్రజా రాజీవ్, కమలాపురం గీతాంజలి రమేష్, భూనాద్రి సురేష్ వార్డు సభ్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











