నిడమనూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం.......
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:19
నల్గొండ జిల్లా నిడమానూరు మండలం నిడమనూరు గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజారి
పంచాంగ శ్రవణం బోధించారు.
ఈ శుభ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ మన్నెం శంకర్, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.












