శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం...... కమనీయం.....!
ప్రజా గొంతుక భీమదేవరపల్లి:-
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలోని శ్రీ తాపాల లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా వేద పండితులు ప్రసాద్ పంతులు ఆధ్వర్యంలో ఆలయంలో 108 కలిశాలతో, స్వామివారికి మహా యజ్ఞం నిర్వహించి, ప్రత్యేక పూజలు అందించారు.. శుభ ముహూర్తాన వేద పండితులు శ్రీ తాపాల లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని కమనీయంగా జరిపారు.. గ్రామంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.. కోరిన కోరికలు తీర్చే లక్ష్మీనరసింహస్వామి దర్శించుకోవడం మహాభాగ్యంగా, భక్తజనులు భావించారు.. పురాతన కాలానికి చెందిన ఆలయం కావడం, భక్తజనులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గూడెల్లి కల్పన తిరుపతిరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పెద్ది శివకుమార్, వైస్ చైర్మన్ బర్రె రమణారెడ్డి, డైరెక్టర్లు, మాజీ సర్పంచులు, మాజీ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు,భక్తులు, శ్రీ హరిహర భక్తజనుల కళాబృందం, ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...












