విద్యుత్ కోతలను అరికట్టాలి
సిపిఎం మండల కార్యదర్శి సిరిపంగి స్వామి
మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు
వలిగొండ మార్చి 17 ప్రజా గొంతుక ప్రతినిధి విద్యుత్ కోతల వల్ల రైతుల మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని విద్యుత్ కోతలు అరికట్టి నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేయాలని సిపిఎం వలిగొండ మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు డిమాండ్ చేశారు మంగళవారం గోపరాజుపల్లి గ్రామంలో ఇంటింటి కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై ప్రజల నుండి వస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను చూస్తుంటే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఒక్కటి కూడా అమలు కాలేదని వృద్ధాప్యపెన్షన్ తులం బంగారం రైతు భరోసా రైతు బీమా లాంటివి నేటి వరకు అమలు కాలేదని వారన్నారు గోపరాజు పల్లి పాల సెంటర్నుండి మూసి వరకు రోడ్డు మంజూరు అయ్యిందని చెప్పి నేటికీ అమలుకు నోచుకోలేదు అన్నారు గోపరాజు పల్లి క్రాస్ రోడ్ నుండి దుప్పల్లి వరకు రోడ్డు అసంతృప్తిగా ఉన్నదని దానిని వెంటనే పూర్తి చేయాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి ఏనుగుల నరసింహ సలిగంజి రాజయ్య గాజుల మల్లయ్య రుద్ర పెళ్లి లింగయ్య సలిగంజినరసింహరుద్రపల్లిరామలింగంసలిగంజినవీన్ ముత్యాలు తదితరులు పాల్గొన్నారు












