జ్యూడిషియల్ కమిటీని మాత్రమే ఒప్పుకుంటాం
రాజకీయ కమిటీలు వేస్తే ఉద్యమకారులు నష్టపోయే ప్రమాదం ఉంది సంగిశెట్టి క్రిస్టఫర్ మలిదశ ఉద్యమకారుడు
వలిగొండ మార్చి 16 ప్రజా గొంతుక ప్రతినిధితెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమకారులను గుర్తించడానికి జ్యుడీషియల్ కమిటీని మాత్రమే ఉద్యమకారులు ఒప్పుకుంటారని కానీ రాజకీయ లేదా అప్పటి టీజేఏసీ నాయకులతో కమిటీ వేస్తే ఉద్యమకారులు నష్టపోయే ప్రమాదం ఉన్నదని అలాంటివి కాకుండా జ్యుడీషియల్ చట్టబద్ధత కలిగిన కమిటీని మాత్రమే ఉద్యమకాలను గుర్తించడానికి వేయాలని మలిదశ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంఘీశెట్టి క్రిస్టఫర్ డిమాండ్ చేశారు












