పెళ్లిరోజు పురస్కరించుకొని తిరుమల దర్శనం.శివంపేట.ప్రజా గొంతుక న్యూస్,మార్చ్ 13 : మెదక్ జిల్లా.చేగుంట మండలం,చందాయిపేట గ్రామ తాజా మాజీ సర్పంచ్, నిరంతర శ్రామికుడు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ సంఘ సేవకులు, యువకిశోరం, యంగ్ అండ్ డైనమిక్ యువ నాయకులు బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ దంపతుల 16 వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవం వైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకోవడం పరమ పవిత్ర అనుభూతిని ఇచ్చిందన్నారు.ఈ సందర్భంగా మా గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలు,పాడిపంటల కలగాలని,అలాగే గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించాను.మా గ్రామం ఆర్థికంగా,సామాజిక రంగాల్లో సత్తా చాటి, ఎదగాలని ఆ దేవదేవుని శ్రీ వేంకటేశ్వరుడిని కోరుకోవడం జరిగింది.












