బిఆర్ఎస్ నాయకుడు పై కాంగ్రెస్ నాయకుడు దాడి.
శివంపేట.ప్రజా గొంతుక న్యూస్,మార్చ్ 13:
మెదక్ జిల్లా.శివంపేట మండలం, కొంతన్ పల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ తన వ్యవసాయ పొలం వద్ద పనులు చేసుకుంటుండగా అదే గ్రామానికి చెందిన శివంపేట మండల ,కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడుబిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ పై దాడికి పాల్పడి, తన వద్దనున్న కారు తాళం చెవి తీసుకొని కారును తీసుకువెళ్లడం జరిగింది.బిఆర్ఎస్ పార్టీ ఆకుల శ్రీనివాస్ శివంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ నాయకుడైన నాపైదాడిని,ద్రౌజన్యాన్ని బీసీ నాయకులు ఖండించాలన్నారు.












