వైష్ణవి ఎంక్లేవ్ లో నూతన పార్క్ ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
కుత్బుల్లాపూర్ మార్చ్ 11 ప్రజా గొంతుకకుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 - జీడిమెట్ల డివిజన్ వైష్ణోవి ఎంక్లేవ్ లో 50.00 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కాలనీ పార్కును బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..... ప్రజల జీవన ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల కల్పనలో భాగంగా గత 12 ఏళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి జీడిమెట్ల డివిజన్ తో పాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి పరచామని, రానున్న రోజుల్లో కూడా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో వైష్ణవి ఎంక్లేవ్ అధ్యక్షులు రంగు వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎంపీఆర్ చంద్రశేఖర్, కోశాధికారి రాకేష్, స్థానిక బిఆర్ఎస్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్ధిరాములు, అనిల్, నరేందర్ రెడ్డి, జయం చారి, సిల్వర్ పార్క్, అర్బానా, ఫ్రూట్స్ ఎంక్లేవ్, శ్రీని ఎన్క్లేవ్ తో పాటు పలు కాలనీలవాసులు తదితరులు పాల్గొన్నారు.











