సమస్యల పరిష్కారానికి పోలీసులు ప్రజాప్రతినిధుల మధ్యన సమన్వయం తో ఉండాలి.
ప్రజా గొంతుక ( మార్చి 7) కాల్వ శ్రీరాంపూర్ : సామాజిక సమస్యలు, గ్రామాలలో భద్రతా అంశాల పై, సమస్యలు పరిష్కరించడానికి పోలీసులకు ప్రజాప్రతినిధుల కు మధ్యన సమన్వయంతో ఉండి సమస్యల పరిష్కరానికి కృషి చేయాలి ఎస్సై వెంకటేష్ అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పోలీస్ స్టేషన్ ఆవరణంలో మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులతో ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో గ్రామాల్లోని సమస్యల పై వారితో చర్చించారు. గ్రామల సురక్షిత కోసం ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి అని, యువకులు గ్రామ ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వారికి ఎస్ఐ సూచించారు. అలాగే ఆన్లైన్ బెట్టింగ్ వలన ఆర్థిక నష్టాలు జరిగే అవకాశం ఉందని, బెట్టింగ్ వలన ఎన్నో కుటుంబాలు వీధిన పడిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని వారికి తెలిపారు. గ్రామాలు సురక్షితంగా ఉండాలంటే,చట్టల పరిధిలో పనిచేయాలని చట్టాలు అతిక్రమించినచో శిక్షలు విధించబడతాయని అన్నారు. వారి వెంట ఏఎస్ఐ నీలిమ, యేసయ్య ఆనంద్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.













