రాష్ట్ర స్థాయి అర్చరి పోటీలకు పెగడపల్లి సన్ షైన్ స్కూల్ విద్యార్థి ఎంపిక.
ప్రజ గొంతుక( మార్చి 7) కాల్వ శ్రీరాంపూర్ : పెగడపల్లి సన్షైన్ లార్నింగ్ స్కూల్ విద్యార్థి రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక.కరీంనగర్ జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ల్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలలో అండర్-10, అండర్-13, అండర్-15 విభాగాల్లో పోటీలు నిర్వహించాగా, అండర్-10 విభాగంలో కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని పెగడపల్లి గ్రామంలోని సన్షైన్ లార్నింగ్ స్కూల్ విద్యార్థి కోడారి శ్రీహన్ష్ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ రాష్ట్రస్థాయి పోటీలు మార్చి 8న హైదరాబాద్లో నిర్వహించబడనున్నాయి అని,
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొమురోజు శ్రీనివాస్, నిర్వాహకులు అభిషేక్, మహేందర్, సంతోష్, కోచ్ రేగళ్ల రవి తెలిపారు.విద్యార్థి సాధించిన ఈ విజయానికి సన్షైన్ లార్నింగ్ స్కూల్ పెగడపల్లి కరస్పాండెంట్ సయ్యద్ నసీర్, ఉపాధ్యాయులను అభినందిచారు.రాష్ట్రస్థాయి పోటీలలో కూడా మంచి ఫలితాలు సాధించాలనివారు ఆకాంక్షించారు.












