ప్రజాపాలన, ప్రజా ప్రణాళికపై చర్చ.
ప్రజా గొంతుక చేర్యాల: పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఉన్న సమస్యల గురించి పట్టణ కౌన్సిలర్లు చర్చించారు . అదే విధంగా ప్రభుత్వం నిర్వహించబోయే ప్రజాప్రణాళిక, ప్రజాపాలనపై కౌన్సిలర్లతో చర్చించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ముస్త్యాల అరుణ మాట్లాడుతూ చేర్యాల పట్టణమంతా పరిశుభ్రంగా ఉంచాలని, అభివృద్ధి పనులు ముందుండాలని తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మెడిశెట్టి ఉమా, కౌన్సిలర్లు వీరబత్తిని సదానందం, నిమ్మ సుప్రజా, మహమ్మద్ ఈజాజ్ అహ్మద్, భూనాద్రి సురేష్, వెలుగల దుర్గయ్య, గీతాంజలి, షరీఫా బేగం, మున్సిపల్ కమిషనర్ నాగేందర్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ, మేనేజర్ ప్రభాకర్ తదితరులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.












