ప్రజల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తున్న నల్లగొండ పోలీస్......
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:06
నల్లగొండ పట్టణంలోని పద్మా నగర్ కాలనీలో మైనర్ బాలిక కిడ్నాప్ ఘటనపై 100 నంబర్కు సమాచారం...
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బంది
ఫిర్యాదుదారు పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇంటి వద్దకే చేరిన టూ టౌన్ పోలీసులు
బాధితుల వద్దే ఫిర్యాదు స్వీకరించి వెంటనే కేసు నమోదు
ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాని ప్రతిని ఫిర్యాదుదారికి అందజేసిన టూ టౌన్ ఎస్సై వై సైదులు
ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వెంటనే దర్యాప్తు ప్రారంభించిన టూ టౌన్ పోలీస్ అధికారులు
బాలికను త్వరితగతిన గుర్తించి కేసును ఛేదిస్తామని బాధితులకు టూ టౌన్ పోలీసుల భరోసా
ప్రజలకు తక్షణ సేవలు అందించడంలో నల్లగొండ పోలీస్ వేగవంతమైన చర్యలు...












