పదో తరగతి విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ
చౌటుప్పల్ మార్చి 02( ప్రజా గొంతుక)
గ్రీన్ గ్రోవ్ స్కూల్స్లో పదో తరగతి విద్యార్థుల ఫేర్వెల్ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
దారావత్ సూర్యం (ఎస్బిఐ ఎస్సీ, ఎస్టీ అధ్యక్షులు),
జితేందర్ రెడ్డి (తెలంగాణ టీవీ కేబుల్ జే ఏ సి ప్రెసిడెంట్),
పాల్గొన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వీణ అనీల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలు ఏర్పరుచుకొని క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. పాఠశాల డైరెక్టర్ లక్ష్మి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పాఠశాల ఎల్లప్పుడూ వారి విజయాలను గర్వంగా స్వాగతిస్తుందని పేర్కొన్నారు.
ముఖ్య అతిథి దారావత్ సూర్యం విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం అందిస్తూ, కష్టపడితే అసాధ్యం అనేది లేదని, పట్టుదలతో లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు. జితేందర్ రెడ్డి యువత భవిష్యత్తు దేశ భవిష్యత్తు అని, నైతిక విలువలు పాటిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి, వారి భవిష్యత్తు విజయవంతం కావాలని ఆశీర్వదించారు.
చివరగా, విద్యార్థులు తమ గురువులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య ముగిసింది.జ్












