నకాశి పెయింటింగ్ ను నేర్చుకున్న విద్యార్థులు.
ప్రజా గొంతుక చేర్యాల : పట్టణంలోని గీతం యూనివర్సిటీ ఆర్ట్స్ విద్యార్థుల ఆధ్వర్యంలో సుమారుగా 50 మందికి పైగా విద్యార్థులు నకాశి కళాకారుడైన నాగిళ్ల గణేష్ గృహంలో నకాసి కల గురించి పెయింటింగ్ ను నేర్చుకున్నారు. నకాశి కల గురించి వాటిని చూసి నేర్చుకోవాలని సంకల్పంతో భారతదేశంలో మంచి గుర్తింపును పేరును తెచ్చుకోవాలని విద్యార్థులు అన్నారు. ఈ కార్యక్రమంలో నాగిళ్ళ గణేష్, నాగుల వెంకటేశం, నాగుల వరలక్ష్మి, చింటూ, గీతం యూనివర్సిటీ అధ్యాపకులు, కొండా నరేందర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.












