భార్య కాపురానికి రావడం లేదని భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య.
ప్రజా గొంతుక (మార్చి 2) కాల్వ శ్రీరాంపూర్ : భార్య కాపురానికి రావడం లేదని, భర్త ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రం నికి చెందిన కందునూరి రాజకుమార్ భార్య మౌనిక ఐదు సంవత్సరాల నుండి భర్త ని విడిచిపెట్టి వెళ్లిపోయింది, అప్పటినుండి ఒంటరిగా బ్రతకలేక మద్యానికి బాని సై ఒంటరిగా జీవిస్తున్నాడు. అదే క్రమంలో ఆదివారం సాయంత్రం మద్యం తాగి ఇంట్లో వెళ్లి పడుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున మృతుని తల్లి కందునూరి మల్లేశ్వరి ఉదయం 4 గంటలకు వెళ్లి చూడగా, తన రూమ్ లోనే సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించగా, చుట్టుపక్కల వారికి సమాచారం తెలపడంతో, అప్పటికే రాజ్ కుమార్ మృతి చెందినట్లు గమనించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లగా, ఈ విషయం మృతుని బామ్మర్ది అయిన వేణుగోపాల చారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏస్ ఐ తెలిపారు.












