లైవ్ ఫిష్ మార్కెట్ షాప్ ప్రారంభోత్సవం చేసిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్,
హై కోర్ట్ న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్...
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:01
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం
స్థానిక హాలియా మున్సిపాలిటీ అంగడి బజార్ నందు రెడ్డి లైవ్ ఫిష్ మార్కెట్ షాప్ ను ప్రారంభించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్ , హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ప్రోప్రైటర్ నూకల గోపి రెడ్డి హాలియా ప్రాంత ప్రజలకు సముద్ర మాంసాన్ని, ఆరోగ్యకరమైన చేపలను అందజేయాలనే ఆకాంక్షతో హాలియా నందు లైఫ్ ఫిష్ మార్కెట్ ను ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయులు వడిత్యా రాజు, ఎరనాగుల సైదులు, రమావత్ కృష్ణ,రాజేష్,కడారి సైదులు, రియల్ ఎస్టేట్ వ్యాపారి అశోక్, కరాటె మాస్టర్ వెంకట్,కిలారి దుర్గా ప్రసాద్, స్థానిక వ్యాపారులు నాగేశ్వరరావు, అబ్దుల్లా, వట్టె నరేష్ యాదవ్, మన్నెం కోటి తదితరులు పాల్గొన్నారు.












