విద్యుత్ షాక్ అమర్చి అడవి పందిని చంపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
ప్రజా గొంతుక (మార్చి 1) కాల్వ శ్రీరాంపూర్ : మండలంలోని పెద్దరాతుపల్లి గ్రామంలో పోలీస్ లు పొట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఎక్సెల్ ద్విచక్ర వాహనం పై అడవి పందిని తీసుకు వెళ్తున్న,మండల కేంద్రం నికి చెందిన పల్లపు నర్సయ్య అను వ్యక్తి,అనుమానాస్పదంగా కనిపించడం తో, ఆతన్ని నిలిపి విచారించగా, విద్యుత్ షాక్ అమర్చి, అడవి పందిని చంపినట్లు నేరం ఒప్పుకొనగా, వాహనం తో సహా అతన్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించినట్లు ఎస్సై తెలిపారు. తదుపరి చర్యల కొరకు ఫారెస్ట్ అధికారులకు అప్పగించడం జరిగిందని ఎస్ఐ తెలిపారు ఎస్సై పేర్కొన్నారు.












