పోచన్నపేట గ్రామ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక...
అధ్యక్షులు గా జుల కిష్టయ్య,ప్రధాన కార్యదర్శి గా చింతపండు బాలకృష్ణ ..
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
పొచ్చన్నపేట గ్రామ మున్నూరు కాపు సంఘం నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులు గా జుల కిష్టయ్య ప్రధాన కార్యదర్శి గా చింతపండు బాలకృష్ణ ప్యానెల్ విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా గోపాల నర్సిములు,సభ్యులుగా ముదం సిద్దయ్య, జుల భాస్కర్లను సలహాదారులు గా చింతపండు ఆంజయ్య,మట్టి బిక్షపతి,జుల క్రిష్ణ లను. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాపై నమ్మకంతో ఈ గౌరవ పదవులు అప్పగించిన సంఘం నాయకులకు పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సంఘం అభివృద్ధికి ప్రభుత్వం నుంచి రావలసిన పథకాలు కూడా అందరికీ అందే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దాదాపు ఈ కార్యక్రమంలో 60 కుటుంబాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.












