పేదల ఆపద్బాంధవుడు పోతుల రాములు యాదవ్....
కష్టాలు తెలుసుకొని ఆదుకునే నాయకుడు రామన్న....
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
పోచన్నపేట గ్రామంలో నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ,, ఆపద్బాంధవుడిలా ఆర్థిక సహాయం అందిస్తూ ,కష్టాలు తెలుసుకొని నేనున్నానని ఆదుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సామాజికవేత్త, పోతుల రాములు యాదవ్ మరో కుటుంబానికి అండగా నిలిచారు. అనారోగ్యంతో మృతి చెందిన రేణిగుంట బాలయ్య కుటుంబాన్ని కలిసి పరామర్శించి, నేనున్నానని మనోధైర్యాన్ని నింపి ఆర్థిక సహాయంగా 5000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అడగకుండానే ఇంటికి వచ్చి ఆర్థిక సాయం అందించిన వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలియజేశారు. పోతుల రాముల యాదవ్ మాట్లాడుతూ నిరుపేదలకు సహాయము అందించడం, ఆదుకోవడంలోనే అసలైన సంతృప్తి అని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ముందు ఉంటానని తెలియజేశారు.ఈసందర్భంగారేణుకుంటసత్తయ్య,బాలరాజు,దిలీప్,తరిగొప్పుల శ్రీశైలం, రేణుకుంటయాదయ్య, భాను, తీగలచంద్రమౌళి, మంత్రి సిద్ధులు,రేణుకుంట జయమ్మ తదితరులు పాల్గొన్నారు.














