ఘనంగా మహా శివరాత్రి వేడుకలు.
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెంజిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పాత చర్ల శివాలయంలో మహాశివరాత్రి పర్వదిన దిన సంధర్బంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు సాయికృష్ణ అధ్వర్యంలో అంగరంగ వైభవంగా విచ్చేసినటువంటీ భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణంతా మార్మోగింది. ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉపవాస దీక్షలు చేపట్టిన ప్రజలు ఉదయం నుంచే శివాలయంలో శివుడిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులు పరమ శివుడిని పంచామృతంతో అభిషేకం, పాలాభిషేకం,తేనెభిషేకం,మంత్ర పుష్పం,పుష్పార్చన, చేశారు.అనంతరం శివరాత్రి సందర్భంగా స్వామివారి ఊరేగింపుకార్యక్రమంచర్ల పురవీధుల్లో జరిగింది.ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ గుత్తులశ్రీనివాసరావు.జల్దాని గోగిరాజు.ముదిగొండసతీష్.వానపల్లి హరిప్రసాద్.ఈరసవడ్ల లక్ష్మణరావు. తదితరులు పాల్గొన్నారు.












