15 వ వార్డు డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి రమేష్ ఘనవిజయం....
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్:ప్రజా గొంతుక న్యూస్:పిబ్రవరి:13
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. 15 వ వార్డు డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి రమేష్ కార్పొరేటర్ గా ఘన విజయం సాధించారు. గెలుపొందిన దొడ్డి రమేష్ చర్లపల్లి లోని బొడ్రాయి వద్ద కొబ్బరికాయ కొట్టి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా దొడ్డి రమేష్ మాట్లాడుతూ.తన విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు , మిత్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గెలుపు నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. పలువురు నాయకులు కార్యకర్తలు దొడ్డి రమేష్ కు అభినందనలు తెలిపారు.












