విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: వరంగల్ పోలీసులు
ప్రజా గొంతుక డెస్క్
ఫిబ్రవరి (13)
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించవద్దని వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఆదేశించారు. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విజేతలు తమ సంబరాల కోసం మరో రోజును కేటాయించుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.












