మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి
ప్రజా గొంతుక న్యూస్, (ఫిబ్రవరి 09)సూర్యాపేట : ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు.సోమవారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొని మాట్లాడారు. 33వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగుల శ్రీనివాస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే సూర్యాపేట మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.












