మూగబోయిన మైకులు.
ప్రజా గొంతుక చేర్యాల : పట్టణంలోని ఈనెల 11న జరిగిన మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం రోజున సాయంత్రం 5 గంటల వరకు మైకులు మూగ బోయాయి. దాదాపు గత వారం రోజుల నుండి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన మైకులు మూగ బోవటంతో పట్టణమంతా సైలెంట్ గా మారిపోయింది. దాదాపు గత వారం రోజుల నుండి ప్రచారంలో నిమగ్నమైన నాయకులు అభ్యర్థులకు కొంత విశ్రాంతి దొరికినప్పటికీ ఎన్నికలకు ఇంకా 48 గంటల సమయం మిగిలి ఉండటంతో ఓటర్ మహాశయులను ఆకట్టు చేసుకునేందుకు అభ్యర్థుల ప్రయత్నాలు చేస్తున్నారు.












