బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన..... రిక్కల ఇంద్ర సేనా రెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:31
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేత,
బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రిక్కల ఇంద్రసేనారెడ్డి తమ అనుచరులతో కలిసి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కేటీఆర్ వారికి పార్టీ కండువా కప్పి,బీఆర్ఎస్ పార్టీలోకి ఆత్మీయంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసి కోటి రెడ్డి మాజీ ఎమ్మెల్యే నోముల భగత్,
మాజీ ఎమ్మెల్యే తిప్పని విజయసింహ రెడ్డి,మాజీ జెడ్పీ చైర్మన్ గుజ్జ దీపికా యుగేందర్ రెడ్డి, మాజీ ఆప్కాబ్ చైర్మన్ ఎడవెళ్లి విజేందర్ రెడ్డి హాజరయ్యారు.
వేదిక: ఎర్రవెల్లి కేసీఆర్ నివాసంలో పాల్గొన్నారు













