సమ్మక్క–సారలమ్మ జాతరను దర్శించుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ప్రజా గొంతుక రిపోర్టర్ గుగులోతు రమేష్ నాయక్
( జనవరి 30)
జనగామ నియోజకవర్గంలోని నర్మెట్ట మండలం అమ్మాపూర్, తరిగొప్పుల మండలం
అబ్దుల్ నాగారం, బొంతగట్టు నాగారం- బొత్తల పర్రె అలాగే మద్దూరు మండలం కుటిగల్ గ్రామాలలో నిర్వహిస్తున్న సమ్మక్క–సారలమ్మ జాతరకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు శుక్రవారం హాజరై అమ్మవార్లను దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి, సుఖసంతోషాల కోసం అమ్మవార్లను ప్రార్థించారు. అనంతరం జాతర ఏర్పాట్లపై ఆలయ కమిటీ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకుని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు












