*శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిలువెత్తు బంగారం తో (బెల్లం)తులా భారం సమర్పించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్*
ప్రజా గొంతుక న్యూస్ రాయికల్
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాయికల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, నిలువెత్తు బంగారం (బెల్లం) తులా భారం సమర్పించారు. ఈ సందర్భంగా రాయికల్ మున్సిపల్ మాజీ కో ఆప్షన్ సభ్యులు మహేందర్ బాబు మాట్లాడుతూ జగిత్యాల ఎమ్మెల్యే గా డాక్టర్ సంజయ్ కుమార్ 2023 ఎన్నికలలో గెలుపొందాలని వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నానని, ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ స్వామివారి మొక్కు తీర్చినట్టు అయిందని మహేందర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ మరియు మండల నాయకులు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.












