నేటి నుంచి పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందజేత
*జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో*
ప్రభుత్వ ఆదేశాల మేరకుస్థానిక పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్దకల్ నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. సురేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు నేటి నుంచి అల్పాహారం అందజేయడం ప్రారంభించడమైనది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు శుభ, భాస్కర్, జాకీర్ హుస్సేన్ మరియు పదవ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు.












