ముల్కనూర్ సమ్మక్క సారక్క జాతర పనులను పరిశీలించిన
ఏసీపీ ప్రశాంత్ రెడ్డి..
ప్రజా గొంతుక భీమదేవరపల్లి:-
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో జరగబోయే సమ్మక్క సారలమ్మా జాతర పనులను ఏసిపి ప్రశాంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు.. ఈ సందర్భంగా జాతర బందోబస్తు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ ఏర్పాటు తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.. అనంతరం నూతన కమిటీ సభ్యులు ఏసీపీని శాలువాతో సత్కరించారు.. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పెద్ది వెంకట్ నారాయణ గౌడ్, ఎలుకతుర్తి సీఐ పులి రమేష్, వంగర ఎస్సై దివ్య, నూతన సమ్మక్క సారలమ్మ చైర్మన్ జక్కుల ఐలయ్య, డైరెక్టర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు..












