పల్లా రాజేశ్వర్ రెడ్డి ఖబర్దార్...
స్థానికేతరునివి మీకే అంత ఉంటే మాకెంత ఉండాలి...
మాజీ ఎంపీటీసీ మొహమ్మద్ మసూద్
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
మంత్రి సీతక్క శుక్రవారం రోజున జనగామ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనల కోసం విచ్చేసిన సందర్భంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక శాసనసభ్యుడీ హోదాలో ఉండి గతి తప్పి,మతి పోయి, స్థిమితంకోల్పోయి,మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలు వింటూ ఊరుకోబోమని నాలుక చీరేస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ,మాజీ ఎంపీటీసీ మహమ్మద్ మసూద్ హెచ్చరించారు. స్థానికేతరునివి మీకే అంత ఉంటే మా నాయకులు స్థానికులు మేము స్థానికులం మాకెంత ఉండాలి అని అన్నారు. జనగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి రాలేదని జనగామ నియోజకవర్గాన్ని దోచుకో పోవడానికి వచ్చావ్ అని అన్నారు.మీరు వాడిన పదజాలం బహిరంగంగా నిరక్షరాస్యులు కూడా వాడరని, ఖబర్దార్ పల్లా అని హెచ్చరించారు.











