కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా
వసంత పంచమి,అక్షరాభ్యాసం వేడుకలు...
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:23
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియాలోని స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో
వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మొదటగా వేద బ్రాహ్మణుల సమక్షంలో గణపతిపూజ,
సరస్వతీ పూజ
నిర్వహించి. తర్వాత అక్షరాభ్యాసం
కార్యక్రమం నిర్వహించారు. తల్లిదండ్రులు
తమ చిన్నారు
లతో ఈ కార్యక్రమంలో పాల్గోని శాస్త్రీయంగా తమ
చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించి అమ్మవారి
దీవెనలు పొందారు. ఈ కార్యక్రమంలో పాఠశాల
డైరెక్టర్ నిమ్మల లక్ష్మారెడ్డి , సరస్వతీ , పాఠశాల
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు
పాల్గోన్నారు.











