తెలంగాణ రాష్ట్ర సాధకులకు శుభవార్త రాబోతుందా?
ప్రభుత్వం నుంచి అందుతున్న సంకేతాలు
సంగిశెట్టి క్రిస్టఫర్ మలిదశ ఉద్యమకారుడు
వలిగొండ జనవరి 22 న్యూస్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించిన సాధకులకు శుభవార్త రాబోతుందా అనే సందేహాలు కలుగుతున్నాయని టియు జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగీశెట్టి క్రిస్టఫర్ అన్నారు గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఉద్యమకారుల అంశంపై దృష్టి సారించబోతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉద్యమకారులు ఉద్యమకారుల అంశాన్ని ఎప్పటికప్పుడు పదిలంగా ఉంచాలని ఆయన అన్నారు ఉద్యమకారులను గుర్తించినట్లయితే ప్రభుత్వం మరో పదేళ్లు అధికారంలో ఉండడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు లేకుంటే ఉద్యమకారుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు












