పార్టీ వ్యతిరేకులు పార్టీకి అవసరం లేదు....
పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తప్పవు...
మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏండి పిరోజ్....
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని అని బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు ఎండి ఫిరోజ్ అన్నారు. గత సర్పంచి ఎన్నికలలో మండలంలో పలు గ్రామాలలో కొంతమంది బిఆర్ఎస్ పార్టీ ముసుగులో వేరే పార్టీలకు సంబంధించిన సర్పంచ్, వార్డు అభ్యర్థులకు మద్దతిస్తూ కొంతమంది సర్పంచులు ఓడి పోవటానికి కారణం అయ్యి, మెజారిటీ తగ్గడానికి కూడా కారణమై,పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు.బిఆర్ఎస్ పార్టీ లో కుతంత్ర రాజకీయం నడవదని అలాంటివారికి పార్టీలో స్థానం లేదని, మండలంలో సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ అభ్యర్థుల ఓటమికి కారణమైన వారి వివరాలు సేకరించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.












