ఎమ్మెల్యేను కలిసిన బి ఆర్ ఎస్ వి మండల అధ్యక్షుడు బాలకృష్ణ...
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండలం, లక్ష్మాపూర్ గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బచ్చన్నపేట మండల బిఆర్ ఎస్ వి మండల అధ్యక్షులు చింతపండు బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. పోచన్నపేట గ్రామంలో పార్టీ పరిస్థితి కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మొదటి నుండి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేసిన అందరికీ గుర్తింపు ఉంటుందని, గ్రూపు రాజకీయాలకు చోటు లేకుండా, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేశారు. కార్యకర్తల, నాయకుల సమన్వయం కోసం ఒకరోజు పోచ్చన్నపేట గ్రామానికి రావడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బోడిగం చంద్ర రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ కానుగంటి బాలచందర్, కల్లూరి అనిల్ రెడ్డి, వేముల సాగర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.












