ఏ ఆర్ కంటి హాస్పటల్ ను సద్వినియోగం చేసుకోవాలి
ప్రజా గొంతుక న్యూస్, (జనవరి 21)సూర్యాపేట:ఏ ఆర్ కంటి హాస్పటల్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. పట్టణంలోని నిర్మల హాస్పిటల్ రోడ్ లో అలీ సాహెబ్ పాషా ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఆర్ కంటి హాస్పటల్ ను బుధవారం వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధరావత్ వీరన్న నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఫసీయుద్దీన్, దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, వైద్యురాలు పి, వనజ, తదితరులు పాల్గొన్నారు.











