నూతన తహసీల్దార్ ని కలిసిన ప్రజా ప్రతినిధులు..
ప్రజా గొంతుక బచ్చన్నపేట:
బచ్చన్నపేట మండల తహసీల్దార్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన హుస్సేన్ ను కేశిరెడ్డిపల్లి పల్లి గ్రామ సర్పంచ్ ఆరె రవి కుమార్, ఉపసర్పంచ్ చింతల రాజు, బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కాపర్తి హరిప్రసాద్, మాజీ ఎంపిటిసి కర్ణాల వేణుగోపాల్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ పరిధిలో ఏమైనా పనులు ఉంటే తమని సంప్రదించమని కోరారు.












