జనగామ జిల్లా గోపాలమిత్ర సంఘం అధ్యక్షులుగా యాటెల్లి ఆంజనేయులు
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం జనగామ జిల్లా గోపాలమిత్ర సంఘం ఆధ్వర్యంలో జనగామ జిల్లా గోపాలమిత్ర కమిటీ ఎన్నిక నిర్వహించడం జరిగింది ఇట్టి సమావేశంలో గోపాలమిత్ర సంఘం కమిటీని ఎన్నిక నిర్వహించగా జనగామ జిల్లా గోపాలమిత్ర సంఘం అధ్యక్షులుగా యాటెల్లి ఆంజనేయులు ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా కొంపల్లి నాగేష్ ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులు చండి కుమార్ ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది .ప్రధాన కార్యదర్శిగా కొంపేల్లి పర్షరాములు,కోశాధికారి రాగిరి సమ్మయ్య ని ఎన్నుకోవడం జరిగింది .సహాయ కార్యదర్శిగా నునావత్ జాగ్మల్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నిక ను జనగామ జిల్లా గోపాలమిత్ర సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నిక జనగామ జిల్లా గోపాలమిత్ర సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ గోపాల మిత్రుల అభివృద్ధికి కృషి చేస్తానని , ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం మార్గం చూపుతానని అన్నారు.












