కొంతన్ పల్లి లో చింతల విజయ వెంకట్రాంరెడ్డి ఆర్థిక సహాయం.
శివంపేట. ప్రజా గొంతుక న్యూస్, జనవరి 20:
మెదక్ జిల్లా. శివంపేట మండలం,కొంతన్ పల్లి గ్రామానికి చెందిన కోమటి పెంటమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రోజున రాత్రి మృతి చెందడం జరిగింది.ఈ విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకొని గ్రామ సర్పంచ్ చింతల విజయ వెంకట్రాంరెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 5,000 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో ఉపసర్పంచ్ బోలారం కుమార్, వార్డు మెంబర్ నెంబర్ సంతోష్ కుమార్, శంకర్, కళాకాంటి వెంకటేష్, ప్రసాద్, భూమలింగం మరియు గ్రామ పాలక మండలి సభ్యులు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.












