స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు నోటీసులు
ప్రజా గొంతుక డెస్క్
మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సమాధానం చెప్పాలని గడ్డం ప్రసాద్కు జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. అన్ని పిటిషన్లపై విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది.
కాగా, పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల విషయంలోనూ సుప్రీంకోర్టులో పలుసార్లు విచారణ జరిగింది. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న శాసనసభ్యులపై దాఖలైన అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు నిర్ణయం వెలువరించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ పాటించలేదని విపక్ష నేతలు అంటున్నారు.












