నూతన తాసిల్దార్ గా రాముడు పదవి బాధ్యతలు చేపట్టారు.
ప్రజా గొంతుక (మార్చి 23) కాల్వ శ్రీరాంపూర్ : మండలంలోని నూతన తహసిల్దార్ గా డాక్టర్ ఆర్. రాముడు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా తాసిల్దార్ ను బదిలీ పై వెళ్తున్న తాసిల్దార్ జగదీశ్వర్ రావు, డిప్యూటీ తాసిల్దార్ శంకర్ గౌడ్, వారిని శాలువాతో సన్మానించారు.ఇక్కడ విధులు నిర్వహించిన తాసిల్దార్ జగదీశ్వరరావు బదిలీపై భద్రాచలం జిల్లాలోని పాల్వంచ కు డిప్యూటీ కలెక్టర్ గా వెళ్లరు. పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న రాముడును, కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని తాసిల్దార్ కార్యాలయానికి పదోన్నతి పై తాసిల్దార్ బదిలీ చేయగా సోమవారం రోజున తాసిల్దార్ రాముడు గా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తాసిల్దార్ రాముడు మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.ప్రభుత్వ పథకాలు, కులం ఆదాయ, ధ్రువినకరణ పత్రాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరువ చేసి, మండలాన్ని అభివృద్ధి బాటలొ నడిపిస్తానన్నారు.











