ఆదిత్య శ్రావణ్ సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కి ఎంపిక
*ఆర్థిక సహాయం అందజేసిన మహేశ్వరం నియోజకవర్గం మహిళ విభాగం అధ్యక్షురాలు సమత ప్రకాష్*
*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చ్ 23:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నియోజకవర్గం అధ్యక్షురాలు సమతా ప్రకాష్ మాట్లాడుతూ.. ఆదిత్య, శ్రావణ్, లకుసౌత్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కి ఎంపిక అయ్యిన సందర్భంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఏకలవ్య స్పోర్ట్స్ క్లబ్ క్రీడాకారులు ఆదిత్య, శ్రావణ్ ఈనెల కర్ణాటకలోని దావణగేరి యూనివర్సిటీలో 26 నుండి 29 వరకు జరిగే ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఇద్దరూ క్రీడాకారులు సెలెక్ట్ కావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎంపికైనందువలన వీరిద్దరికీ మహేశ్వరం నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సమతా ప్రకాష్ అభినందించడంతో పాటు వీరికి 10,000 ఆర్థిక సహాయం క్రీడాకారులకు అందించినారు. క్రీడాకారులను ఏకలవ్య స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ భాస్కర్ రెడ్డి , అధ్యక్షులు సురేందర్ , రంగారెడ్డి జిల్లా ఖో ఖో అసోసియేషన్ కోశాధికారి ముత్యాల మహేందర్ క్రీడాకారులను అభినందించడం జరిగింది.











