రాష్ట్రీయ గౌరవ్ సమ్మాన్ అవార్డు అందుకున్న కర్క నాగరాజు
హైదరాబాద్ మార్చ్ 23( ప్రజా గొంతుక )
కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ కు చెందిన కూకట్పల్లి నియోజకవర్గం ఐ.యన్.టి.యు.సినాయకులు,పీజేఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు కర్క నాగరాజు కు అత్యంత ప్రతిష్టాత్మికమైన రాష్ట్రీయ గౌరవ్ సమ్మాన్ అవార్డు 2026 అందుకున్నారు. కలకత్తా నగరం లోని బెహెల శరత్ సదన్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమం లో కర్క నాగరాజు అవార్డును భారత మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ మెహతాబ్ హుస్సేన్ చేతుల మీదుగా అందుకున్నారు.
సోషల్ సర్వీస్ అండ్ ట్రేడ్ యూనియన్ లీడర్షిప్ కేటగియరీ లో ఎంపికయ్యారు. అనంతరం అవార్డు గ్రహీత కర్క నాగరాజు మీడియా ప్రతినిధిలతో మాట్లాడుతూ... అవార్డు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ తను చేసిన సామజిక సేవలు, ట్రేడ్ యూనియన్ ద్వారా కార్మికులకు చేస్తున్న సేవలను గుర్తించి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు నన్ను రాష్ట్రీయ గౌరవ్ సమ్మాన్ అవార్డుకు ఎంపిక చేసినందుకు వారికి ధన్యవాదములు తెలిపారు.
ఈ అవార్డుతో తనపై మరింత భాద్యత పెరిగిందన్నారు.
ఈ రోజు నాకు చాలా గర్వంగా మరియు భావోద్వేగంగా ఉందన్నారు.
రాష్ట్రీయ గౌరవ్ సమ్మాన్ అవార్డు 2026 అందుకోవడం కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, నా ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరి సమిష్టి కృషికి గుర్తింపు. కలకత్తా నగరంలో మాజీ భారత మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ మెహతాబ్ హుస్సేన్ నుండి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం నాకు చాలా గౌరవంగా ఉంది. ఈ క్షణం నా జీవితంలో అత్యంత చిరస్మరణీయమైన మైలురాళ్లలో ఒకటిగా నిలిచిపోతుంది.
సామాజిక సేవ మరియు ట్రేడ్ యూనియన్ నాయకత్వం కోసం ఈ అవార్డు కార్మికుల సంక్షేమం మరియు సమాజ అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పనిచేయాలనే నా నిబద్ధతను బలపరుస్తుంది. నాయకత్వం అనేది పదవి గురించి కాదు, బాధ్యత, అంకితభావం, సేవ గురించి అని నేను గట్టిగా నమ్ముతున్నాను.
ప్రతి సవాలులో నాకు తోడుగా నిలిచిన కార్మికులు, మద్దతుదారులు, నా కుటుంబ సభ్యులందరికీ నేను ఈ గౌరవాన్ని అంకితం చేస్తున్నానని వారి ప్రోత్సాహం నమ్మకం నా గొప్ప బలం.
నా ప్రయత్నాలను గుర్తించినందుకు అవార్డు నిర్వాహకులకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ గుర్తింపు నన్ను మరింత అభిరుచి మరియు సమగ్రతతో పనిచేయడం కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది అని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బెంగాలీ సినీ నటులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.











