ఎమ్మెల్యే సహకారంతో మిర్యాలగూడ టు దేవరకొండ రోడ్డు కాలువ బ్రిడ్జివద్ద గుంతలు పూడ్చివేత........
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:23
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ లోని నేషనల్ హైవే167 దేవరకొండ టు మిర్యాలగూడ రోడ్డు
స్వామినాయక్ ఇంటీ నుండి పోలీస్ స్టేషన్ వరకు,కాలువ బ్రిడ్జి మీద,ఉన్న రోడ్డు గుంతల మయంగ ఉండటం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఎంతో మంది గాయాల పాలయ్ నారు.ఇట్టి ప్రమాదాలను గుర్తించి నాగార్జునసాగర్ శాసనసభ్యులు
కుందూరు జైవీర్ రెడ్డి సహకారంతో
నేషనల్ హైవే 167 అధికారులతో మాట్లాడి తక్షణమే రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చి వేయించాలి అని సూచించారు.
ఎమ్మెల్యే ఆదేశాల తో
హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి అధికారులతో మాట్లాడి గుంతలని పూడ్చి వేయించారు.
అదేవిధంగా వాహనదారులు కూడా అట్టి బ్రిడ్జిపై వెళ్లేటప్పుడు నెమ్మదిగా వెళ్ళమని సూచించారు.











