అక్రమ అరెస్టు అప్రజాస్వామీకం బిజెపి మండల అధ్యక్షుడు బంగారు మహేష్
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలంకాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6హామీలను అమలు చేయకుండా అబద్ధాలతో పాలన కొనసాగిస్తుంది అని వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండు చేస్తూ ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు.అందులో భాగంగా అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ఉదయమే బిజెపి మండల అధ్యక్షుడు బంగారు మహేష్,బిజెపి జిల్లా అధికార ప్రతినిధి సద్ది సోమిరెడ్డి, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి గద్ద రాజు మరియు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ అక్రమ అరెస్టులు, ఎన్ని చేసినా ప్రజల తరఫున ఉద్యమాలు ప్రజా పోరాటాలు చేపడుతామని అన్నారు.











