ప్రజాసేవలోనే కాదు భక్తిలోను ముందే సర్పంచ్ కోడూరు స్వర్ణలత శివకుమార్
కోదండ రామస్వామి ఆలయానికి చందా ప్రకటించిన సర్పంచ్
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో గత 15 సంవత్సరాలుగా గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి రంగులు లేక వెలవెలబోతుండడం చూసి మనసు చెల్లించిన గ్రామ సర్పంచ్ కోడూరు స్వర్ణలత శివకుమార్ గౌడ్ కమిటీతో మాట్లాడి 70 వేల రూపాయలు ఇప్పించి గ్రామ సర్పంచిగా తనవంతుగా 20000 అక్షరాల ఇరవై వేల రూపాయలు ఇచ్చి దేవాలయాలపైవారికిఉన్నతనభక్తిఉదారస్వభావాన్నిచాటుకున్నారూ. పురోహితులు మినలాపురం హనుమంతరావు కూడా తన వంతుగా 50వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది . ఉప సర్పంచ్ చల్ల కమలాకర్ 10 వేల రూపాయలు తనవంతుగా ఇవ్వడం జరిగింది.ప్రజాసేవలోనే కాదు భక్తిలోను సర్పంచ్ కోడూరు స్వర్ణలత శివకుమార్ ఉన్నారని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తాటికొండ రామాంజనేయులు మాజీ ఎంపిటిసి మల్గసిద్ధి రాములు వేముల లక్ష్మణ్ గౌడ్ ,అంబాల ప్రభాకర్ గౌడ్ కలకుంట్ల స్వామి వేముల సంపత్ పాతకోటి సత్తయ్య కూచన బాలకృష్ణ ఆలయ పూజారి సిద్ధార్థ శర్మ పాల్గొన్నారు.










